01-10-2018 PRESS NOTE --- జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం : శ్రీ వెంకట్రామ రెడ్డి
జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం : శ్రీ వెంకట్రామ రెడ్డి
జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు .. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాటు, మౌలిక సదుపాయాలు,ఓటరు జాబితా సవరణ కార్యక్రమం , బందోబస్తు వంటి తదితర అంశాల పరిస్థితిపై సీఈవో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి , శిక్షణ కలెక్టర్ రాహుల్ శర్మ , dro శ్రీ ఖీమ్యా నాయక్ , rdo శ్రీనివాస్ తదితరులు ఈ విసి కి కలెక్టరేట్ నందు హాజరయ్యారు.
జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు , ఓటరు జాబితా సవరణ కార్యక్రమం , స్వీప్ కార్యక్రమాలు , ఈవిఎం, వివి ప్యాట్ ల మొదటి దశ తనిఖీ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపదుతున్నామని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డిరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ కు వివరించారు .
------------------------------ ------------------------------ --

Comments
Post a Comment