Skip to main content

23.10.2018 -- PRESS NOTE AND PHOTOS -- ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి

ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని  ఏర్పాట్లు చేస్తున్నాం :  కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి 

సిరిసిల్ల 23, అక్టోబర్ 2018
జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని   ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి   తెలిపారు .

మంగళవారం  హైదరాబాద్  తాజ్ కృష్ణ హోటల్ నందు  జిల్లాల ఎన్నికల అధికారులు ( కలెక్టర్ లు ) ఎస్పీలతో   కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒపి రావత్ నేతృత్వంలో 11 సభ్యుల కేంద్ర ఎన్నికల బృందం సమావేశం నిర్వహించింది .
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి జిల్లా లో ఎన్నికల సన్నద్ధత పై సవివరంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించారు .

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న  ఏర్పాట్ల ను  ఒపి రావత్   కు వివరించారు. ఓటర్ల  జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది, ఎన్నికల నియమావళి, స్వీప్ కార్యక్రమాలు తదితర అంశాలపై కూలంకషంగా కేంద్ర ఎన్నికల అధికారులకు కలెక్టర్ వివరించారు .

ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ తో పాటు ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

GENERAL ELECTIONS - 2018 -- 28- VEMULAWADA ASSEMBLY CONSTITUENCY -- BROCHURE AND PROFILE DETAILS

15-08-2017 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -- ఫోటోలు

21-06-2017-- గౌ. రాష్ట్ర మంత్రి శ్రీ కె టి ఆర్ గారు ఆవిష్కరించిన సిరిసిల్ల నియోజకవర్గ మూడేళ్ళ ప్రగతి నివేదిక ప్రతి