గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటరుగా నమోదు అవ్వాలి : కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి
మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీం నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం కు సంబంధించి ఓటర్ల నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసిందన్నారు .... కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లా లో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదవ్వాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ వెంకట్రామ రెడ్డి కోరారు .
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు .
షెడ్యూల్ ప్రకారం అర్హులైన పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు . ముసాయిదా జాబితాను 2019 జనవరి 1న ప్రచురిస్తుందన్నారు . మార్పులు, చేర్పులకు జనవరి 31 వరకు గడువు నిచ్చిందన్నారు . ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 20న విడుదల చేయనుందని తెలిపారు .
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కుపొందండిలా...
★ 2018 నవంబర్ 1వ తేదీకి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
★ 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో డిగ్రీ పొంది ఉండాలి.
★ కనీసం మూడేళ్లు నియోజక వర్గ పరిధిలో నివాసం ఉండాలి.
★ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు అయ్యే వారు ఫారం-18ని పూర్తి చేసి స్థానిక తహశీల్దారు/ఎంపీడీఓ కార్యాలయాల్లో అందచేయాలి.
★ గతంలో ఓటరుగా నమోదు అయిన వారు మరలా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి
★ ఫారం-18తోపాటు డిగ్రీ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది.
★ 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో డిగ్రీ పొంది ఉండాలి.
★ కనీసం మూడేళ్లు నియోజక వర్గ పరిధిలో నివాసం ఉండాలి.
★ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు అయ్యే వారు ఫారం-18ని పూర్తి చేసి స్థానిక తహశీల్దారు/ఎంపీడీఓ కార్యాలయాల్లో అందచేయాలి.
★ గతంలో ఓటరుగా నమోదు అయిన వారు మరలా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి
★ ఫారం-18తోపాటు డిగ్రీ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది.
★ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అయిన వారు సంబంధిత డిపార్ట్ మెంట్ అధికారిధృవీకరణతో పంపించాలి.
★ సాధారణ ఓటర్ల జాబితాకు, పట్టభద్రుల ఓటర్ల జాబితాకు ఎలాంటి సంబంధం లేదు.
★ సాధారణ ఓటర్ల జాబితాకు, పట్టభద్రుల ఓటర్ల జాబితాకు ఎలాంటి సంబంధం లేదు.



Comments
Post a Comment