11-11-2018 ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి : కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి -- PRESS NOTE
ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి : కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి
ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురణ, ప్రసారం చేసేందుకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ) నుంచి ముందస్తు అనుమతి పొందాలని కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు అయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేసారు .
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ నియమించినట్లు తెలిపారు. స్థానిక కేబుల్ ద్వారా టీవీల్లో ప్రసారం చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రకటనలు, స్క్రోలింగ్లకు సంబంధించి 24 గంటల ముందు నిర్ణీత నమూనాలో ఎంసీఎంసీకి దరఖాస్తు చేసి అనుమతులు పొందాలన్నారు. కమిటీ అనుమతి లేకుండా ప్రసారం చేస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావాళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేసారు .
------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------
ISSUED BY DPRO RS
Comments
Post a Comment