ప్రచురణార్థం విస్తృత ప్రచారంతోనే చివరి గడపకి సంక్షేమ పథకాలు - డిపిఆర్ఓ దశరథం సిరిసిల్ల 13,మే 2017: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అప్పుడే ప్రభుత్వ పథకాలు జిల్లాలోని చివరి గడపకు చేరుతాయని అన్నారు . శనివారం డిపిఆర్ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో డిపిఆర్ఓ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం , పేదలు , బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వీటిపై ప్రజలకు కళారూపాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ , డబల్ బెడ్ రూం ఇళ్లు , ఆసరా ఫించన్లు , హరితహారం , ఇతర ప్రాధాన్యత పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. జూన్ లో యాదవ, కురుమలకు ప్రభుత్వం గొర్రెలను యూనిట్లను రాయితీ తో అందించనున్నందున ఆ పథకం పై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు . ...